జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం రోజున మంగళగిరిలో జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం (జనరల్ బాడీ మీటింగ్) జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసుపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారంటూ మండిపడినట్లు సమాచారం. అలాగే అరవ శ్రీధర్ విషయంలోనూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలిసింది.