Census Enumerator attacked In Bhimavaram: ఏపీలో జన గణన జరుగుతోంది.. ఈ క్రమంలో జనాభా లెక్కల కోసం వెళ్లిన సచివాలయ కార్యదర్శిపై దాడి చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. సచివాలయ ఉద్యోగి వివరాలు సేకరిస్తున్న సమయంలో ఐడీ కార్డు విషయంలో గొడవ జరిగింది. సచివాలయ ఉద్యోగిపై స్థానికులు దాడి చేశారు.. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. సచివాలయ ఉద్యోగిపై దాడిని నిరసిస్తూ తోటి ఉద్యోగులు ధర్నా చేశారు.