ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఓ మోడల్ సూచించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై చంద్రబాబు మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ అనంతరం ప్రధాని మోదీ చంద్రబాబుకు ఓ సలహా ఇచ్చారు. జపాన్లోని మియావాకి పద్ధతిని అమరావతి నిర్మాణంలో అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ క్రమంలో మియావాకి మోడల్ అంటే ఏమిటో తెలుసుకుందాం.