నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో లంకె బిందెల పేరుతో మహిళ నుంచి ఓ వ్యక్తి రూ.8 లక్షలకు పైగా వసూలు చేశాడు. ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని.. వాటిని బయటకు తీయకపోతే ఎవరో ఒకరు చనిపోతారని నమ్మించి డబ్బు వసూలు చేశాడు. ఆ తర్వాత పూజలు చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతుండగా.. బాధితురాలు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు.