తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ కల్పించింది. తీవ్రవాదం, ఉగ్రవాదం అణచివేతలో విశేష ప్రతిభ కనబరిచిన నలుగురు సీఐలకు డీఎస్పీలుగా, ఇద్దరు రిజర్వ్ ఇన్స్పెక్టర్లకు అసిస్టెంట్ కమాండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది పోలీసుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం పేర్కొంది.