ఆపరేషన్ కగార్, మావోయిస్టుల శాంతి చర్చలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ చర్చించారు. శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తితో కేంద్రంతో చర్చలకు ప్రభుత్వం సిద్ధమైంది. మావోయిస్టులతో జానారెడ్డి గతంలో చర్చలు జరిపిన అనుభవం ఉండటంతో ఇవాళ ఉదయం ఆయనతో భేటీ అయిన రేవంత్ విలువైన సలహాలు తీసుకున్నారు. ఈ చర్చలు తెలంగాణలో మావోయిస్టు సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉంది.