ఆదిలాబాద్లోని ఓ జిమ్లో డ్రగ్స్ కలకలం రేపింది. పోలీసులు దాడి చేసి భారీగా డ్రగ్స్, స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తెప్పించిన డ్రగ్స్, విటమిన్ టాబ్లెట్స్ను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో ఈగల్ టీమ్ గంజాయి కొనుగోలు చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో సహా 86 మందిని అరెస్ట్ చేసింది. మల్నాడు కిచెన్ వ్యవహారంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న యజమాని సూర్యతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లల్లో డోర్ డెలివరీ చేసినట్లు సమాచారం.