పాతబస్తీలో హిందువుల ఓటు బ్యాంకు పెరగాలని, ఉగ్రవాద దాడులకు భయపడి వెళ్లిన వారంతా తిరిగి రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. బోనాల సందర్భంగా నగరంలోని ఆలయాలను సందర్శించిన ఆయన, హిందూ ఉత్సవాలకు నిధులు అడుక్కునే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. పన్నులు కట్టకుండా దాడులు చేసే సంస్కృతి పాతబస్తీలో ఉందని, అది మారాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీలోని దేవాలయాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.