హైదరాబాద్ జీడిమెట్లలో కన్నతల్లిని పదో తరగతి బాలిక తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తమ ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని భావించిన ఆ బాలిక, ప్రియుడు, అతని సోదరుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదు రోజుల క్రితమే బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మృతురాలి అక్క మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.