తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి సుమారు మూడింతలు పెరిగి 2,000 చదరపు కిలోమీటర్లకు చేరుతుంది. విలీనం వల్ల శివారు ప్రాంతాలకు మెరుగైన మౌలిక వసతులు, అభివృద్ధి లభిస్తుంది... అయితే, ప్రజలపై ఆస్తి పన్ను భారం పెరుగుతుందనే ఆందోళన ఉంది. వీటితో పాటు.. విలీన ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా జీహెచ్ఎంసీ మెగా సిటీగా మారనుంది.