విశాఖ వ్యాలీలో ఉన్న జువైనల్ హోమ్ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జువైనల్ హోమ్లోని సిబ్బంది వేధిస్తున్నారంటూ బాలికలు ప్రహారీ గోడెక్కి ఆందోళనకు దిగారు. మత్తు మందు ఇచ్చి వేధిస్తున్నారంటూ జువైనల్ హోమ్లోని బాలికలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వారిని లోపలికి పంపించారు. మరోవైపు జువైనల్ హోమ్ సిబ్బందిపై బాలికల ఆరోపణలపై హోం మంత్రి వంగలపూడి అనిత రియాక్టయ్యారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.