తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీలోపు ఆదిలాబాద్ కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేస్తామని హామీ ఇచ్చారు. ఎయిర్పోర్టుతో పాటు జిల్లాలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి ఆదివాసీలకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అలాగే.. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్త యూనివర్సిటీని కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే అందుకు సంబంధించిన భూసేకరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.