ఆస్తమా బాధితులకు ఏటా పంపిణీ చేసే చేప ప్రసాదానికి సమయం ఆసన్నమైంది. జూన్ 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. భారీగా ఆస్తమా రోగులు రానున్న నేపథ్యంలో వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.