వచ్చే ఏడాదికి సంబంధించిన తల్లికి వందనం నిధులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జూన్ నెలలో విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలో తల్లికి వందనం డబ్బులు జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం నిధులను విడుదల చేయనున్నట్లు తేల్చి చెప్పారు.