జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం సాధించేందుకు సీఎం రేవంత్రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. ప్రతి డివిజన్కు మంత్రులు బాధ్యతలు కేటాయించారు. రహమత్నగర్ డివిజన్ బాధ్యతలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపట్టనున్నారు. బోరబండ డివిజన్ సీతక్క, మల్లు రవి.. వెంగళరావునగర్లో తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి.. సోమాజిగూడలో శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్.. షేక్పేట్లో కొండా సురేఖ, వివేక్.. ఎర్రగడ్డలో దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు.. యూసుఫ్గూడలో ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించారు.