జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో నవంబర్ 11వ తేదీలోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే.. బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లే అని ఆయన ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టులపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే 4 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.