జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ఓటర్లకు కొత్త ఓటరు కార్డులు పంచడం వివాదాస్పదమైంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఉపఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.