జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉండనుంది. బీఆర్ఎస్ మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీకి దిగే అవకాశం ఉంది. మజ్లిస్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వనుండటంతో.. ముస్లిం-యాదవ్ (MY) ఓటు బ్యాంకు కాంగ్రెస్కు కలిసివచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.