తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులు ఆరు నెలల పాటు సమ్మెలు చేయకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 10 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, 1971 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే 10 నుంచి నవంబర్ 9 వరకు పవర్ కార్పొరేషన్లలో సమ్మెలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిందని విషయం తెలిసిందే.