ఇంజనీరింగ్ చేయాలనే ప్రతీ ఒక్కరూ క్యాంపస్ లో సీటు రావాలని కోరుకుంటారు. దీనిలో భాగంగానే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కష్టపడుతుంటారు. అయితే అనూహ్యంగా ఈ సారి జేఎన్టీయూ క్యాంపస్ లో సీట్లు మిగిలిపోయాయి. వాటికి సంబంధించి స్పాట్ అడ్మిషన్లు ఈ నెల 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో పాటు.. తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన సీట్లకు కూడా స్పాట్ ప్రవేశాల నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది.