జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఇంటరాక్షన్’ పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్లను మానసికంగా వేధించిన ఘటన బయటపడింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఘటనలు ఆగకపోవడంపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యాంటీ ర్యాగింగ్, ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీలు పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు, యాజమాన్యం భద్రతా వ్యవస్థను సమీక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిపుణులు విద్యార్థులు ర్యాగింగ్ చర్యలను తేలికగా తీసుకోకుండా ఆగాలని హెచ్చరిస్తున్నారు. కమిటీలు చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.