టీడీపీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. వంశీని పది రోజుాలపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతుండగా.. తనకు నడుం నొప్పి ఉందని, పడుకోవడం బెడ్, ఇంటి నుంచి ఫుడ్ తెప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాలని.. బెయిల్ ఇవ్వాలని కోరుతూ వంశీ కూడా కోర్టులో పిటిషన్ వేశారు. జగన్ బుధవారం జైలుకు వెళ్లి వంశీని కలిసిన సంగతి తెలిసిందే.