నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల విడిపోతారంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి జ్యోతిష్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్లపై చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయగా.. కమిషన్కు విచారించే అధికారం లేదంటూ ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా.. హైకోర్టు ఆ స్టేను ఎత్తేసింది. కమిషన్కు విచారణ అధికారం ఉందని వారంలో రోజుల్లోనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.