టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది?.. IPL ప్రిడిక్షన్ ఉచ్చుతో జాగ్రత్త: సజ్జనార్

2 months ago 17
ఐపీఎల్ క్రికెట్ సీజన్‌లో పెరుగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలపై హైదరాబాద్ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. టాస్, మ్యాచ్ ఫలితాలను ముందే చెబుతామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే 129 ప్రొఫైళ్లను, 494 పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్లను అధికారులు బ్లాక్ చేశారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
Read Entire Article