శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) హైదరాబాద్ (Hyderabad) నుంచి పుట్టపర్తికి (Puttaparthi) ప్రత్యేక బస్సు సేవలను ప్రకటించింది. నవంబర్ నెలలో ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు ఎంజీబీఎస్ (MGBS) నుంచి సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయి. ఒక్కొక్కరికి రూ. 2,100 చార్జీ వసూలు చేస్తారు. భక్తులు ఆన్లైన్ ద్వారా లేదా బుకింగ్ ఏజెంట్ల వద్ద సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చని హైదరాబాద్-1 డిపో మేనేజర్ ఎం. వేణుగోపాల్ తెలిపారు.