తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. ఇవాళ తిరుపతి భవానీనగర్లో బాలకృష్ణ ప్రసాద్ ఇంటి నుంచి అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం హరిశ్చంద్ర శ్మశాన వాటికలో ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి ఆయన ఇద్దరు కుమారులు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఇవాళ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.