టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ కన్నుమూత

1 year ago 13
విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ కన్నుమూశారు. అన్నమయ్య పదార్చనకే అంకితమై.. అనుదినం తన స్వరమాధుర్యంతో పండిత పామరులందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తిన ఆయన తన సంగీత ప్రస్థానాన్ని చాలించారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనవుల జాజర, విన్నపాలు వినవలె, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు, తిరువీధుల మెరసేనీ దేవదేవుడు, చూడరమ్మ సతులాల..’ ఇలా వెయ్యికి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి, ఆలపించారు. టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా కూడా ఉన్నారు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌. ఆయన తిరుపతి భవానీనగర్‌లో తన స్వగృహానికి సమీపంలో వాకింగ్‌కు వెళ్లిన ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంపై టీటీడీ అధికారులు, ఉద్యోగులు సంతపాన్ని వ్యక్తం చేశారు.
Read Entire Article