TTD Eo Bungalow Cobra: తిరుపతిలోని టీటీడీ ఈవో జే శ్యామలరావు బంగ్లాలో గురువారం రాత్రి భారీ నాగుపాము కలకలం సృష్టించింది. బంగ్లా సిబ్బంది వెంటనే రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ నాయుడుకు సమాచారం ఇవ్వగా, ఆయన పామును పట్టుకునే ప్రయత్నంలో పాము కాటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.