అనాథ పిల్లలకు టీటీడీ మంచి అవకాశం కల్పిస్తోంది. ఎస్వీ బాలమందిరంలో అనాథ పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తోంది. 2026-27కు సంబంధించి ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే 16వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ప్రవేశాలు పొందిన వారికి టీటీడీ విద్యాసంస్థలలో ఉచితంగా విద్యను అందిస్తారు. వారి బాగోగులను ఎస్వీ బాలమందిరం చూసుకుంటుంది.