తిరుమలకు సంబంధించి టీటీడీ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేలా కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తిరుపతి తిరుమల మార్గంలో ఎలక్ట్రిక్ బస్సులు బస్సులు నడపాలని నిర్ణయించింది. త్వరలోనే తిరుపతి తిరుమల మార్గంలో పూర్తి స్థాయిలో విద్యుత్ వాహనాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో తిరిగే అద్దె వాహనాలు, ట్యాక్సీలను కూడా దశల వారీగా విద్యుత్ వాహనాలతో భర్తీ చేస్తాయని ఆయన వెల్లడించారు.