Trust Board To Meet: ఈనెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసరంగా సమావేశం కానుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లపై టీటీడీ సభ్యులు, అధికారులతో పాలక మండలి సమీక్షించనున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. భక్తులకు సౌకర్యాలపై అధికారులకు టీటీడీ ఛైర్మన్ సూచనలు చేయనున్నారు. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. తిరుపతి ఘటన దృష్ట్యా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని.. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దుపై టీటీడీ ఇప్పటి ప్రకటన చేసింది.