తితిదే పరకామణి చోరీ కేసులో అప్పటి ఏవీఎస్వో సతీష్ కుమార్, బోర్డు అనుమతి లేకుండా లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టులో ఈవో నివేదిక సమర్పించారు. ఈ రాజీకి సతీష్ కుమార్ అర్హత లేదని, సీఐడీ దర్యాప్తు కోరుతూ పిటిషనర్ వినతిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారని తెలిపారు. తుది నిర్ణయం బోర్డు సమావేశంలో తీసుకుంటామని హైకోర్టుకు వివరించారు.