Progressive Humanitarian Gesture By A Ttd Woman Employee: టీటీడీ మహిళా అధికారి కట్టమంచి ఇందిర, మరణానంతరం తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల ప్రయోజనం కోసం తిరుపతి స్విమ్స్ మెడికల్ కాలేజీకి దానం చేసేందుకు అంగీకారం తెలిపారు. తన భర్త డాక్టర్ శివాజీ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆమె నిర్ణయాన్ని అభినందించారు. మరోవైపు, జనవరి 25న జరిగే రథసప్తమి వేడుకలకు భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.