TTD Non Hindu Employees: టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థుల తొలగింపు అంశం రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు పనిచేస్తున్నారని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై విశ్వాసం లేనివారికి శ్రీవారి సేవలో చోటు లేదని ఆయన అన్నారు. దీనిపై టీటీడీ పాలకమండలి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని కోరారు.