నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. ఒక్కరోజులోనే 105 పనులకు శంకుస్థాపనలు చేశారు. 40 కోట్ల ఖర్చుతో ఈ పనులు చేపట్టనున్నారు. అయితే ఈ నెలలోనే కోటంరెడ్డి మరో 198 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ అన్ని పనులను కలిపి రెండు నెలల్లో పూర్తి చేస్తామని.. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని కోటంరెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి చొరవను మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. ప్రజా ప్రతినిధులకు స్ఫూర్తి అంటూ అభినందించారు.