ఏపీలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల తీరు తీవ్ర వివాదాస్పదం కావడంతో.. తాజాగా ముఖ్యమంత్రి వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేశారు.