Chandrababu On Tdp Membership Rs 5 Lakhs: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనిని రెండు నెలల్లో ముగించాలని.. రాష్ట్రంలో ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు టీడీపీ సభ్యుడిగా ఉండాలని లక్ష్యమన్నారు. పార్టీ సభ్యులకు గతంలో రూ.2 లక్షల ప్రమాద బీమా ఉండేది.. దానిని రూ. ఐదు లక్షలకు పెంచుతున్నామని ప్రకటించారు.