ఏపీ పోలీస్ వ్యవస్థపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీస్ వ్యవస్థ టీడీపీ చెప్పు చేతల్లో పని చేస్తోందని విమర్శించారు. వైసీపీ నాయకులపై టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి.. కూటమి ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత జగన్ సహా వైసీపీ నేతల కుటుంబాలపై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశామని..తమ ఫిర్యాదులపై ఇప్పటి వరకు కేసులు పెట్టలేదని అన్నారు.