తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి కడపలో జరగనుంది. మే 27 నుంచి మూడు రోజుల పాటు జగన్ అడ్డాలో పసుపు పండుగను నిర్వహించడానికి టీడీపీ సిద్ధమైంది. కడప సమీపంలోని సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బాపురం గ్రామాల పరిధిలో వేదిక ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేశారు. మహానాడులో నారా లోకేష్కు పార్టీలో మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సాంప్రదాయ వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేయనున్నారు.