Threatening Letter To Vemireddy Prashanthi Reddy: నెల్లూరు జిల్లాలో బెదిరింపు లేఖ కలకలం రేపింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఈ బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి రూ.2 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించాడు. పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ రెండు ఘటనలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.