టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ పెదవి విరిచింది. టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకర్ని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే నలుగురిలో ఒక్క మహిళ కూడా లేకపోవటంపై వైసీపీ విమర్శించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ ప్రసంగాల్లో చెప్తారని.. కానీ టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం ఒక్క మహిళకు కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వలేదని విమర్శించింది.