Sugavasi Bala Subramanyam To Join In Ysrcp: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూరనుందని భావిస్తున్నారు.