Sugavasi Palakondrayudu Died: తెలుగుదేశం పార్టీలో విషాదం! సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్న పాలకొండ్రాయుడు కుటుంబం పార్టీకి ఎన్నో సేవలు అందించింది. ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం ప్రస్తుతం రాజంపేట టీడీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. రాజంపేట టీడీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.