టీడీపీలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత

7 months ago 10
Reddi Satyanarayana: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో కన్నుమూశారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రెడ్డి సత్యనారాయణ మరణంపై సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Entire Article