తెలంగాణ టూరిస్టులకు గుడ్న్యూస్. హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రోప్వే టూరిజం అందుబాటులోకి రానుంది. పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేలా భువనగిరి కోటపై రోప్వే టూరిజంను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పర్యాటకశాఖ కసరత్తు చేస్తోంది. రూ.56.81 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనుండగా.. ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు.