ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు (టెట్) తేదీ ఖరారైంది. ఈ నెల 10వ తేదీ నుంచి రోజుకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ టెట్ కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్సర్వీసు టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి కావడంతో.. 32 వేల మందికి పైగా ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం (డిసెంబర్ 3) నుంచి టెట్ అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.