Govt Work From Home Jobs Koushalam Exams In Ap: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 'కౌశలం' సర్వే ద్వారా పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించనుంది. సచివాలయాల్లోనే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి, అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వెబ్ కెమెరాలు, హెడ్ ఫోన్లు సిద్ధం చేశారు. త్వరలోనే ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని చెబుతున్నారు.