తెలంగాణలో పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. పదో తరగతి తర్వాత డ్రాపౌట్స్ సంఖ్య తగ్గించేందుకు ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో బాలురకు, బాలికలకు ఒక్కో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని ప్రకటించారు.