తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ స్టూడెంట్స్కు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు దీనిని అమలు చేయనున్నారు. ఒక్కో స్టూడెంట్కు రోజుకూ రూ.15 చొప్పున ఖర్చు చేసి స్నాక్స్ అందించనున్నారు. అందుకు సంబంధించిన మెనూ కూడా విడుదల చేశారు.