ట్రంప్ వైఎస్ జగన్‌ను తీసుకెళ్లాలి.. ఆనం సెటైర్లు

6 months ago 8
సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందాల కోసం గౌతమ్‌ అదానీ నుంచి రూ.1,750 కోట్ల లంచం తీసుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నిర్ధారించడంతో అక్రమాల్లో మాజీ సీఎం జగన్‌ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారన్నారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఈ ఒప్పందాలకు ముందు అదానీ మూడుసార్లు జగన్‌తో సమావేశమయ్యారు. చివరిసారి కలిశాకే పనులన్నీ వేగంగా జరిగాయన్నారు. జగన్‌ అక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగు చూసినందుకు, అతని నిజస్వరూపం ప్రపంచ దేశాలు గుర్తించినందుకు.. ఆనం ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ‘కంగ్రాట్యులేషన్స్‌ జగన్‌’ అని రాసిన కేక్‌ కట్‌ చేసి అభినందించారు. జగన్‌ పాపాలు, తీసుకున్న లంచాలు సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్‌ ఎంతెంత లంచం తీసుకున్నారు? ఆ సొమ్మును ఎక్కడ పెట్టుబడిగా పెట్టారో తెలపాలని ఆనం డిమాండ్‌ చేశారు. జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి 11 ఏళ్లు అవుతోందని, సుప్రీంకోర్టు వాటి విచారణను వేగవంతం చేయాలని కోరారు.
Read Entire Article